పురపాలక సమావేశంలో టిడ్కోకాలనీ సమస్యలు

అమలాపురం: అమలా పురం పురపాలక సంఘము -పి ఎమ్ ఏ వై పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో సంస్థ ద్వారా అల్లవరం మండలం బోడస కుర్రులో 1632 ప్లాట్స్ నిర్మించి లబ్ది దారులకు పంపిణీ చేసింది. టిడ్కో ఇళ్ళుకు వాడకం, త్రాగునీరు లేక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కౌన్సిలర్లు అబ్బిరెడ్డి చంటి తెలుగు దేశం తరఫున ఏడిద శ్రీను జనసేన తరఫున పురపాలక సమావేశంలో కౌన్సిల్ దృష్టికి తీసుకు వచ్చారు. టిడ్కో ఇళ్ళు మీ ప్రభుత్వంలో ఇచ్చేనవే అని వైసీపీకౌన్సిలర్లు అనగానే
అవును పేరు మీరు పెట్టుకున్నారు కదా. అని కౌన్సిలర్ అబ్బిరెడ్డి చంటి
తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళు మేమే కట్టాం, గడియార స్థంభం మేమే కట్టాం, చంద్రబాబు పార్క్ మేమే కట్టాం, మాజీ మంత్రి కుడుపూడి ప్రభాకర్ రావు పేరు కూడా పార్క్ మేమే పెట్టాం.. మీరు చేసింది ఏమిటి అంటూ కౌన్సిలర్ అబ్బిరెడ్డి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు.