తిరుమలశెట్టి నాగేశ్వరావు కుటుంబానికి అండగా గరికపాటి

దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు మండలం, ఈదర గ్రామ నివాసులు తిరుమలశెట్టి పెద్ద రమణయ్య, కోటి రత్నంల కుమారుడు తిరుమలశెట్టి నాగేశ్వరావు(34) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సందర్భంగా, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.