తిరుపతి బైపోల్.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

త్వరలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుండగా.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ కూడా దాఖలు చేశారు.. ఇక, తిరుపతి బైపోల్‌లో జనసేన మద్దతు బరిలోకి దిగుతోన్న భారతీయ జనతా పార్టీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది… దాదాపు ఐదు, ఆరు పేర్లను పరిశీలించిన కమలనాథులు.. వారి బ్యాక్ గ్రౌండ్‌తో సహా అన్ని సమీకరణలపై లెక్కలు కట్టినట్టుగా తెలుస్తోంది.. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రత్నప్రభ పేరు ఫైనల్ చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ మేరకు అధిష్టానానికి పంపించింది.. మొత్తంగా రత్నప్రభ పేరు ఫైనల్‌ కాగా.. కాసేపట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది.

ఇక, తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపగా.. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు.. కరోనావైరస్ బారినపడి కన్నుమూయడంతో.. తిరుపతి లోక్‌సభ స్థానానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.