తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ఛలో పిఠాపురం పోస్టర్ ని ఎమ్మెల్యే కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల మార్చి 14 వ తేదిన 12వ ఆవిర్భావ సభని విజయవంతంగా పూర్తి చేయాలని, వేల సంఖ్యలో పిఠాపురం సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ తన వృత్తికి న్యాయం చేస్తున్నారని పేద బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడమే ఆయన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఆవిర్భావ సభకి విచ్చేయుచున్న జనసైనికులకు, వీర మహిళలకు, నాయకులకు వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి, జానకి రాంరెడ్డి, రాజా రెడ్డి, ఉదయ్ ముదిరాజ్, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment