సంపత్ నాయక్ కి మద్దతుగా తిరువూరు జనసైనికులు

వైరా: జనసేన అభ్యర్థి సంపత్ నాయక్ కి మద్దతుగా సోమవారం వైరా నియోజకవర్గంలో సోమవారం ప్రచారం నిర్వహించిన తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు నియోజకవర్గ నాయకులు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి, వైరా పరిసర ప్రాంత గ్రామాలలో, పలు తండాలలో జనసేన పార్టీ అభ్యర్థి సంపత్ నాయక్ కీతోడుగా కరపత్రాల పంపిణీ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, ఏ.కొండూరు మండల ప్రధాన కార్యదర్శి ముదిగండ్ల సాయి కృష్ణ, తిరువూరు మండల పార్టీ అధ్యక్షులు పర్సా పుల్లారావు, తిరువూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు షేక్ నాగూర్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.