కరువు మండలాలుగా ప్రకటించాలి: రౌతు కృష్ణవేణి

చీపురుపల్లి నియోజకవర్గంలో గల అన్ని మండలాలలో మిచౌన్గ్ తుఫాన్ ప్రభావం వల్ల రైతులు అధికంగా నష్టపోయారు. ఈ సీజన్లో జొన్న పంట అధికంగా వేస్తారు. వరి చేతికొచ్చిన సమయానికి వరి మొత్తం తడిసి ముద్దయింది. చివరికి రైతుకి కన్నీరు, కష్టమే మిగులుతుంది. మెరకముడిదం మండలం ఇప్పలవలస గ్రామంలోరైతులు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి జొన్న వేస్తే చివరికి పంటంతా నేలకొరిగింది. చీపురుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులను ఫీల్డ్ లో సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మరియు చీపురుపల్లి నియోజకవర్గంలో మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని మెరక ముడిదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.