వివాహ వేదిక పైనే వధూ వరులకు.. క్రియాశీలక సభ్యత్వ పత్రాలు అందజేసిన గాదె

*జనసేన పార్టీ నాయకులు.. కార్యకర్తలు నిబద్ధతకు మారుపేరని మరోసారి నిజం చేశారు.. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

పెదపలకలూరు గ్రామనికి చెందిన జనసైనికుడు నరేష్ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. జూలై 10 న సభ్యత్వ కిట్లు పంపిణీ మొదలు పెట్టారు.. ఆదే తేదీన.. నరేష్ వివాహం.. ముఖ్య అతిధులుగా హాజరైన గాదె వెంకటేశ్వరరావు పెండ్లి మండమపం వద్దనే నరేష్-తిరుమల దంపతులకు క్రియాశీలక సభ్యత్వా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్త నరేష్ సంతోషం వ్యక్తం చేశారు.

గాదె వెంకటేశ్వర రావు… మాట్లాడుతూ ఇటువంటి గొప్ప సైనికులు కలిగి ఉండడం పార్టీ చేసుకున్న గొప్ప అదృష్టమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, మధు లాల్, శిఖా బాలు, ముమ్మలనేని సతీష్, పెదపలకలూరు నాయకులు పతెళ్ల మల్లిఖార్జున రావు, షేక్ హుస్సేన్, చెరుకూరి శ్రీను, పిట్టల సాంబశివరావు, జన సైనికులు పాల్గొన్నారు.