జనసేన ఆధ్వర్యంలో గూటాల డబుల్స్ మెన్ షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల అందజేత

పోలవరం, యువత కోడి పందాలు పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని క్రీడల్ని ఎంకరేజ్‌ చేస్థూ క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తూ మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుడ్యం పెంచే సదుద్దేశంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో 01.04.2022 న జరిగిన గూటాల డబుల్స్ మెన్ షటిల్ టోర్నమెంట్ స్పాన్సర్లు ప్రధమ బహుమతి 3333 రూపాయలు జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కార్యక్రమాల నిర్వాహణ కమిటీ సభ్యులు ఆటపాకల వెంకటేశ్వర రావు(ఏ.వి) మరియు ద్వితీయ బహుమతి 2222 రూపాయలు జనసేన పార్టీ పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని ల చేతుల మీదుగా అందచేయడం జరిగింది.