తెలంగాణలో పరీక్షల నిర్వహణ పై నేడే కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. దీంతో టెన్త్,ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సందిగ్దం నెలకొంది. గురువారం విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలకు 15 రోజులు,టెన్త్ పరీక్షలకు 30 రోజులే సమయం ఉంది. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే మరింత ప్రమాదం ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలా లేక రద్దు చేయాలా అనే దాని పై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.