నేతాజీ స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ సూచనలతో దేశం కోసం సర్వం త్యాగం చేసి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన భరతమాత వీరపుత్రుడు, ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి అమరవీరులు స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్బంగా తిరుపతి అనూష మాట్లాడుతూ.. మీరు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క భారతీయుల్లో స్ఫూర్తి నింపిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్న అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి కృష్ణ, ఎం డి ఆయాజ్, తులసి మురళి, సుధాబత్తుల సూరిబాబు, మహేశ్వరీ, దొమ్మటి వంశీ, రాము, దాసరి మూర్తి రాజు, కొల్లు వివేక్, పాత కోట ఆదిత్య రెడ్డి, కానాల వినోద్, రామిశెట్టి కుమార్, సురేష్, దాసి రాంమోహన్ టీడీపీ నాయకులు శివాజీ ముదిరాజ్, ఎస్ డి కరీముల్లా, ఎస్ కె రహిమాన్ గుణదల సురేష్ తదితరులు పాల్గొన్నారు.