మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి.. జనసేన వినతిపత్రం

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ నందు గురువారం మరుగుదొడ్లు ఏర్పాటు కొరకు టి.సుండుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విశ్వనాద్ రెడ్డికి జనసేన పార్టీ తరపున వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ టి. సుండుపల్లి మండల ప్రధాన కేంద్రమైన బస్ షెల్టర్ వద్ద మరుగుదొడ్లు లేక దూరపు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, దూరప్రయాణాలు చేసే వారికి మహిళలు, స్కూల్, కాలేజ్ పిల్లలు, వృద్ధులు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు కావున సదరు విషయమై ఆర్.టి.సి, డి.ఎం గారికి తెలిపి సదరు బస్ షెల్టర్ నందు మరుగుదొడ్లు ఏర్పాటు కోసం కృషి చేయాలని జనసేన పార్టీ మరియు ప్రజలు తరపున కోరుతూ ప్రజా నిత్య అవసరాల కోసం మరుగుదొడ్లకు తగిన నిధులు మంజూరు చేసి నిర్మాణ మఱమ్మతుల పనులు వెంటనే పరిగణలోకి తీసుకుని తక్షణమే పబ్లిక్ టాయ్లెట్ల పనులు చేపట్టాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి యస్ మండల అధ్యక్షుడు మహాదేవ, లోకేష్, శివశంకర్ రాజా, మహేష్, జనసైనికులు పాల్గొన్నారు.