జనసేన మురళి అడుగు భూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగు

అనంతగిరి: గత కొన్ని సంవత్సరాలుగా మండలంలో గలా శంకుపర్తి గ్రామ రైతుల భూములు అక్రమార్కుల వసమైన విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులకు పలువురు ఆక్రమణ దారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియడంతో జనసేనపార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి ఆశ్రయించారు మురళి చాలా రోజుల నుంచి అక్రమణ చేసిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని, అక్రమార్కులకు నిద్రలేని రాత్రులు బహుమానంగా ఇస్తామని పేద అమాయక గిరిజన రైతులనుంచి అక్రమంగా కాజేసినది కాకుండా ఇప్పుడు రకరకాల బెదిరింపులకు పాల్పడటం చూస్తుంటే వీరి గుండాయిజానికి అంతులేదని, ఇప్పటికైనా గిరిజనులు ఒక ఆలోచన చేసి ఇటువంటి అక్రమార్కులకు తమను రక్షించే నాయకులు చేసే బాధ్యతలను అప్పజెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా శంకుపర్తి గ్రామాన్ని చేరుకుని స్థానిక గ్రామస్తులకు మేం ఉన్నామని కోల్పోయిన భూములు తిరిగి పొందే వరకు మీకు అండగా ఉంటామని అన్నారు.