బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి: జనసేన బీసీ రాష్ట్ర నాయకులు హనుమాన్

విజయవాడ, బీసీలు నమ్మకద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇస్తానన్న హామీలను ఇవ్వకుండా బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పం, మడం తిప్పఅం, ప్రాంతం చూడం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అది కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే పరిమితం అని మరొకసారి రుజువు చేసుకున్నారు. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు 90% వరకు నెరవేరలేదు అగ్రిగోల్డ్ స్కాం గురించి బయట పెడతా అని చెప్పారు, సిపిఎస్ సిపిఎస్ రద్దు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అధికారంలోకి వచ్చే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు తీస్తామని చెప్పారు. వచ్చిన ఏడాదిలో పేద ప్రజలకు 25 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పారు బీసీకి మరియు ఎస్సీకి నామినేటెడ్ పదవులు 50% కలిగిస్తాన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే 80% వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందాయి. బీసీ అక్క చెల్లెమ్మకు 50 వేల రూపాయలను వైయస్ఆర్ పెళ్లి కానుకగా ఇస్తాను, జగన్ మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన దొంగ హామీలకు రోజు సరిపోదు. ఈరోజున అన్ని గాల్లో మాటలుగా తీసిపడేసారు బీసీలు కన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి 2024లో బీసీలందరూ కలిపి ఈయనకి సరైన సమాధానం చెప్పి జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తారని జనసేన బీసీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ విజయవాడ ఎం హనుమాన్ ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ మొబీనా, జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ రాము తదితరులు పాల్గొన్నరు.