సత్తెనపల్లి జనసేన అధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళి

సత్తెనపల్లి: ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అంబేద్కర్ గారు అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అయిన మన బాబా సాహెబ్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ గారి చిత్రం పటానికి నివాళులర్పించారు.

అదేవిదంగా మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలోని సావిత్రి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవనారాయణ, వల్లెం శ్రీనివాసరావు, పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ సిరిగిరి మణికంఠ బత్తుల ఆంజనేయులు, చల్ల గరుడ, రాయుడు బాలకృష్ణ, పోతంశెట్టి వెంకటేష్, మాదంశెట్టి మహేష్, రాట్నాల సోమశేఖర్, ఎలిసెట్టి రాంగోపాల్, అమరగుత్తి నాగరాజు, అంబటి వెంకటరామ్ సాయి, పసుపులేటి సాంబశివరావు, కలేటి వెంకటేష్, చౌదరి అనిల్, చౌదరి సాయి, అంబటి వెంకటేష్, పాపిశెట్టి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.