బ్రహ్మసముద్రం పబ్లిక్ వాయిస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళులు

బ్రహ్మసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత “అంబేద్కర్ వర్ధంతి” సందర్భంగా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో బుధవారం “బ్రహ్మసముద్రం పబ్లిక్ వాయిస్” ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల జడ్పీటీసీ ప్రభావతి, మీసేవ సెంటర్ నిర్వాహకులు ఏసేపు, జనసేన పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ బ్రహ్మసముద్రం రాయుడు, వైసిపి నాయకులు నింగప్ప, ఐకేపీ ఆఫీస్ ఈశ్వరప్ప, వాలంటీర్ నాగరాజు, ఆటోచంద్ర, రుద్రముని, సూగేపల్లి మల్లేష్, డీలర్ గొంచిరెడ్డిపల్లి చెన్నమల్ల, చెలిమేపల్లి గంగాధర పాల్గొన్నారు.