పిడుగురాళ్ల జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

గురజాల: భారత రాజ్యాంగ రూపకర్త, అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి, మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 67వ వర్ధంతి సందర్భంగా పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయం నందు, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బేతంచర్ల ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, ఆవుల రమేష్, కార్యదర్శి దీకొండ కిరణ్, బేతంచర్ల నాగేశ్వరరావు, నకరికంటి నర్సి, నాయకులు పెడకొలిమి కిరణ్ కుమార్, వంశీ, మొదలగు వారు పాల్గొన్నారు.