దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కరుకు ఘన నివాళులు

విజయవాడ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దోమకొండ అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనల నుండి రచించబడిన రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశం అనేక కులాల సమ్మేళనం అయిన భారత పౌరులందరూ సమాన హక్కులు పొందగలుగుతున్నారు. వెనుకబడిన వర్గాల వారు అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతున్నారు. అంటరానితనం నిర్మూలనకై అలుపెరగని కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకై సమ సమాజం నిర్మాణం కై ప్రతి ఒక్కరు కృషి చేయాలని అశోక్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో రాజ్యాంగం అమలు చేయని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని వ్యాఖ్యానించారు, దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని ఇంకా వైసీపీ పార్టీలో కొనసాగిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 27 దళిత పథకాలు రద్దు చేశారు, ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు, అంబేద్కర్ విదేశీ విద్య పేరుని మార్చి జగనన్న విదేశీ విద్య అని నామకరణం చేసి దళితులను అవమానించారు, ఇలాంటి వైసిపి ప్రభుత్వానికి రానున్న 2024 ఎన్నికల్లో దళితులందరూ ఓటు అనే ఆయుధంతో వైసీపీని గద్దె దింపాలి అని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ దళితులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనిత పోతిరెడ్డి, 8వ డివిజన్ అధ్యక్షులు మట్ట వివేక్, 19వ డివిజన్ అధ్యక్షులు వాటాల హరిప్రసాద్, 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, 21వ డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి రమణ, 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, 19వ డివిజన్ ఉపాధ్యక్షులు యుగంధర్, 8వ డివిజన్ ఉపాధ్యక్షులు భోగాది అనిల్, వాటాల మణి, బండి ప్రదీప్, మధు, రమేష్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.