జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఎదుట జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి .. జనసేన ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా రాయచోటి అసంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష మాట్లాడుతూ.. అహింస మార్గమున తెల్లదొరలను పారద్రోలిన, బానిస భారతదేశాన్ని విముక్తి చేపించిన ఘనత జాతిపిత మహాత్మాగాంధీ గారికే దక్కుతుంది అన్నారు. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్… మాట్లాడుతూ సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలో నడిపించిన మహాత్ముడు. మనము స్వాతంత్ర భారత దేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగలతోనే అని నేటి తరం గుర్తించుకోవాలి వారి స్పూర్తితో అందరూ చైతన్యవంతులమై, మన సమాజాన్ని భవిష్యత్తులో బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉందని రాబోయే భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, జిల్లా దూదేకుల సంగం అధ్యక్షుడు మస్తాన్, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.