జనసేన పార్టీ మండల అధ్యక్షులకు ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండల అధ్యక్షులు తలారి రాజు దశదినకర్మలో భాగంగా గురువారం ములకలపల్లి మండల అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి, యువజన విభాగం సభ్యులు దశదినకర్మలో పాల్గొని ఘననివాళులు అర్పించారు. తరువాత రాజు అనపరెడ్డిపల్లి మండలంలో జనసేన పార్టీ తరఫున ఒంటరిగా పోరాటం చేయడమే కాకుండా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశాడు అదేవిధంగా మండలంలో ఉన్న అధికార పార్టీ స్థానిక నాయకులు రాజుని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు వాటన్నిటిని కూడా ఎదుర్కొని మండలంలో జనసేన పార్టీ దిమ్మను నిర్మించాడు. అని మరియు జనసేన పార్టీ తరఫున గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాడు అని కరోనా సమయంలో బాధితులకు తన వంతు సాయం చేయడమే కాకుండా మండలంలో మిగతా కార్యకర్తలకు ఆదర్శంగా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశాడు అని ఇప్పుడు మన మధ్యలో తను లేకపోవడం జనసేన పార్టీకి తీరని లోటు అని విచారణ వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నీతి నిజాయితీ గల ఒక వ్యక్తిని కోల్పోయిందని తెలియజేశారు.అధికార పార్టీ నుంచి మరియు స్థానిక నాయకులు నుంచి ఎన్నో ఒత్తిడిలు వచ్చిన ఎంతో ధైర్యంతో ఉండి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో తను ఎప్పుడూ కూడా వెనకడు వేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రెటరీ గరిక రాంబాబు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కొడిమె వంశీ, ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, సహాయక కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.