దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు జయంతి సందర్బంగా నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ
బాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం తెలుగు వారి బాధ్యత అని. అంతటి మహనీయుడి పేరుని మార్చ్ 14న మచిలీపట్టణంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్బావదినోత్సవ ప్రాంగణానికి పెట్టటం అయన ఆర్యవైశ్యలుకి ఇస్తున్న ప్రాధాన్యం ఎటువంటి రాజకీయ పార్టీలో లభించదు అని పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న గౌరవానికి ఆయనకి చిత్తశుద్ధితో ఆర్యవైస్యులు కూడా ఆయనికి అధికారదిశగా అడుగులు వేస్తున్న ఆయనకి తోడ్పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన జిల్లా నగర నాయకుల మీదూరు వరకుమార్, అక్కిశెట్టి శ్రీధర్, దాసరి మాధురి, అజయ్ బాబు, కరీం, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.