రాజోలు జనసేన ఆధ్వర్యంలో మహాత్మునికి ఘననివాళి

రాజోలు, అహింసా పరమో ధర్మః అంటూ, బ్రిటీష్ వారిని తరిమికొట్టిన శాంతి కాముకుడు, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మలికిపురం మండలం గాంధీ బొమ్మల సెంటర్లో మలికిపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో ఘననివాళి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కిపురం మండల జనసేన ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము సఖినేటిపల్లి మండల జనసేన అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను జనసేన నాయకులు ఎంపీటీసీలు, సర్పంచ్ పాల్గొన్నారు.