సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగాలకు నివాళులు

నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో.. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా వారిరువురి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిలాని మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారని బ్రిటిష్ వారి దాస్టికాన్ని ఎదుర్కొన్నారని. అట్లానే విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా గారు బడుగు బలహీన వర్గాలకు తన వంతు సహాయంగా చేస్తూ పేదల పట్ల. విద్య వైద్యం సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిచారని మీరు ఇరువురి ఆశయాలను జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, అద్దేపల్లి ఆనంద్ బాబు, బెల్లంకొండ ఈశ్వర్, బెల్లంకొండ అనిల్, వీరవల్లి వంశి, కృష్ణం శెట్టి గోవిందు, గుప్తా శ్రీకాంత్. ఆర్ కే యాదవ్, హనీ సైదా, మిర్యాల సోము, విజయ్, బోనం జయరాం, రామిశెట్టి రామకృష్ణ, బీమా సాంబయ్య, ఏమలయ్య, జేష్ఠ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.