అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి నివాళులు

విజయనగరం: తెలుగువారి పౌరుష ప్రతీక, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా, స్థానిక రింగ్ రోడ్డు లో ఉన్న అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ముందు మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్ర రాజు, భాస్కర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తి తో ప్రతి ఒక్కరు కూడా పోరాటం స్ఫూర్తి నింపుకొని ప్రతి ఒక్కరు అల్లూరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.