బొబ్బరి మోహన అప్పలనాయుడుకి ఘననివాళులు

విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గం, కోడూరు గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్ కీ.శే బొబ్బరి మోహన అప్పలనాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా స్వర్గస్తులైనందున వారి మిత్రమండలి, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో తాసుబల్లి ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు పెందుర్తి నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు మరణించిన బొబ్బర మోహన్ పేరు మీద వారి మిత్రమండలి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సుమారు 100 మంది రక్తం దానం చేయడం హర్షించవలసిన విషయం అని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరిసా నర్సింగ్, బల్రెడ్డి ప్రసాద్, శంకర్ నాయుడు, గోపి, గవరా శ్రీను, రాడి పెంటారావు, మరియు స్థానిక జనసేన పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.