కూకట్పల్లి జనసేన కార్యాలయంలో గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

కూకట్పల్లి నియోజకవర్గం: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ ఆఫీస్ 5వ ఫేస్ వద్ద కూకట్పల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జీ.వి. వెంకటేశ్వరరావు (రిటైర్డ్ మిథని ఇంజనీర్) గాంధీజీ చిత్ర పటమునకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహాత్ముని మార్గం యువకులకు ఆదర్శనీయమని అహింసా మార్గంలో పరదేశిలను పాలన నుంచి ముక్తి కలిగించిన మహనీయుడు అని, సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్ఛను అందించిన వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ కొల్లా శంకర్, వేముల మహేష్, డివిజన్ ప్రెసిడెంట్లు కలిగినిడి ప్రసాద్, సాలాది శంకర్, సిరిగి నీడి హరీష్. జనసైనికులు నవీన్ శ్రీనివాస్ గోవిందా, అన్నపురెడ్డి వెంకటస్వామి, అశోక్, రాము, సుబ్బు, మధు సుధన్ రెడ్డి, సమ్మెట నరేంద్ర, సురేష్, శేఖర్, రంగబాబు, సుబ్బారావు, మహిళలు ముంతాజ్, మహాలక్ష్మి, సత్యా, పుష్పలత, లక్ష్మి, ద్రాక్షాయిని మరియు జనసేనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.