వంగవీటి మోహన్ రంగాకు పోలవరం జనసేన నివాళులు

పోలవరం నియోజకవర్గం: బగుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన ప్రాణాలే అర్పించింన మహోన్నత స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగా జయంతి పురస్కరించుకుని ఎక్స్ జడ్పీటీసి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కాపు నాయకులు, కాపు యువత జీలుగుమిల్లిలో మంగళవారం రంగా విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు. అన్ని వర్గాలను కలుపుకుని ప్రజలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా పోరాడిన రంగా గారు అందరికి స్ఫూర్తి అని ఆయన 40 ఏళ్ల జీవితం 40 తరాలకు ఆదర్శమన్నారు. అక్కడి నుండి బైక్ ర్యాలీ గా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురిశెట్టి ఏసుబాబు, గంగుల రమేష్, సురిశెట్టి మహేష్, వంకాయల నాగేశ్వరావు, సురిశెట్టి శ్రీను, కోలా మధు, సత్యనారాయణ, శేఖర్, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.