నన్ను నమ్మండి మీకు నేను నిలబడతాను

  • జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజవర్గం: పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి ఉదయ్ శ్రీనివాస్ సూచన మేరకు పిఠాపురం నియోజవర్గం పిఠాపురం టౌన్ లో స్థానిక మిరపకాయల వీధిలో గడపగడపకి జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమన్ని జనసేన పార్టీ నాయకులు చేపట్టారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రతి ఇంటికి పిలుపు నిచ్చారు. జనసేన పార్టీ అధికారంలో రాగానే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతారని మాట ఇచ్చి ఉన్నారు. మాట ప్రకారం ఆయన పిఠాపురం టూరిజం మరియు ఆధునిక టెక్నాలజీతో గవర్నమెంట్ ఆసుపత్రులు, రైతులకు నీరు తెచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిండు శ్రీను, టైల్స్ బాబీ, పెంకె జగదీష్, బీసీ నాయకులు శ్రీనివాస్, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం మరియు పిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.