టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు
తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. బస్టాండుల్లో చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. ప్రయాణికులకు టీఆఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. టికెట్ కొనే సమయంలో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్గా మహత్మాగాంధీ బస్టాప్లో (ఎంజీబీఎస్) టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్ కార్గో సేవల దగ్గర, రేతిఫైల్ బస్టాండ్లోని బస్పాస్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. పరిస్థితి పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆన్లైన్ పేమెంట్ సదుపాయాన్ని అమలు చేస్తామని సజ్జనార్ తెలిపారు.