జనసేన కార్యకర్తలపై టీటీపీ నాయకుల అమానుష దాడి

ఉరవకొండ నియోజకవర్గం, బెళుగుప్ప మండలంలో స్థానిక ఎమ్మార్వో ఆఫిస్ దగ్గర రాత్రి 11 గంటల సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న బెళుగుప్ప జనసేన పార్టీ నాయకుల మీద కర్రలతో మరియు చెప్పులతో కొట్టి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో బోయ రామాంజనేయులు అనే తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే బెలుగుప్పకు వెళ్లి రామాంజనేయులును పరామర్శించి, బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, కార్యదర్శులు గౌతం కుమార్, లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, బాల్యం రాజేష్, అనంతపురం నగర ఉపాధ్యక్షులు జగ్గారెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, బెలుగుప్ప మండల అధ్యక్షులు సుధీర్, ఉరవకొండ మండల కన్వీనర్ చంద్ర శేఖర్, కూడేరు మండల కన్వీనర్ నాగేష్, వజ్రకరూరు కన్వీనర్ కేశవ, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, జనసేన నాయకులు కృష్ణ, మధు, మారుతి, అబ్దుల్, తిప్పయ్య, నాని, ప్రకాష్, శ్రీనివాసులు, నీలకంఠ, మళ్లి, తిలక్, అజయ్, మల్లేష్ గౌడ్,హరీష్ శంకర్, మొదలైన సైనికులు పాల్గొన్నారు.