అక్రమ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం హేయమైన చర్య

  • పండ్రా రంజిత్ కుమార్ కు నోటిసులు ఇస్తున్న టూ టౌన్ ఎస్సై

కడప, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లాల్సిన కడప జిల్లా జనసైనికులను అక్రమ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం హేయమైన చర్య సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజామున వరకు జనసైనికుల ఇంటి వద్ద, ఫోన్ ద్వారా, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్ళి యాత్రకు వెళితే అక్రమ కేసులు పెడతామని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంటే ఎందుకు ప్రభుత్వానికి అంత భయం ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టుల పేరుతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీని జనసైనికులను ఆపలేరని తెలిపారు.