నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలసిన యు.పి.రాజు

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సన్ రైజ్ హోటల్ లో జనసేన పార్టీ విస్తృత సమావేశంలో భాగంగా పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు(యు.పి.రాజు) కలిశారు. ఈ సందర్బంగా రాజాం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలును ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే మరికొన్ని సమస్యలు వినతిపత్రం ద్వారా అందించారు. రాజాం నియోజకవర్గం విస్తృత సమావేశంలో మనోహర్ గారు మాట్లాడుతూ జనవరి నెల మొదటి వారంలో రాజాం వస్తానని సమస్యలపై నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేద్దామని అన్నారని యు.పి.రాజు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి బాలకృష్ణ, లక్షుమనాయుడు మరియు యు.పి.రాజు సోదరుడు ఉర్లాపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.