ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించిన యు.పి.రాజు

  • పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి యు.పి.రాజు

రాజాం నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలు మంచి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం పార్టీ మేనిఫేస్టో, సిద్దాంతాలు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలసా. శ్యామ్, రెడ్డి.బాలకృష్ణ, రమణ, ఈశ్వర్, హరిబాబు, నాగరాజు మరియు గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.