అప్పారావు కుటుంబానికి ఆర్ధికసాయమందించిన ఉభయగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్స్

జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో ఇక్కడ జనంకోసం జనసేన 290వ రోజు కార్యక్రమంలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్రరావు, అప్పారావు ఇంటికి వెళ్లడం ఆయన స్థితిని చూసి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి స్పందిస్తూ ఉభయగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్స్ కడలి ఈశ్వరి, ముత్యాల జయలక్ష్మి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.