తిమ్మాపురం జనసేన ఆధ్వర్యంలో ఉగాది ప్రత్యేక పూజలు

కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో తాతాజీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకొని ఆనంతరం మాదరపు తాతాజీ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజి ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాసరావు, కరెడ్ల గోవింద్ మండల అధ్యక్షులు, బండారు మురళి కరప మండల అధ్యక్షులు, బత్తిన దొరబాబు, తలటం దుర్గబాబు, బుజ్జి, లోవరాజు, సంతోష్, ఎటిఎం, జనసైనికులు వీరమహిళలు, హాజరయ్యి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.