జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

  • జనసేన, టిడిపి పొత్తుతో వైసిపి పతనం ఖాయం
  • రాజంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారని రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వైసీపీ లాంటి దుర్మార్గమైన, నియంత పోకడలుగల ప్రజాకంటక ప్రభుత్వాన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఛాన్స్ అంటూ అధికారం చేజిక్కుంచుకుని తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని,చివరకు రాజధాని లేని రాష్ట్రంగా నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుని ప్రజలపై మోయలేని భారం మోపుతూ వారి జీవితాలను అజ్ఞాతపాతంలోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతతో ప్రజలు జనసేనకు మద్దతు తెలియ జేస్తున్నారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడంపై రానున్న 2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కాయమని మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు.