విడివాడ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు

తణుకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదవారి కన్నీళ్లు మరియు జగనన్న మోసం అనే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు తణుకు నియోజకవర్గ అత్తిలి మండలంలో జగనన్న కాలనీ పరిశీలన మరియు సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ విడువాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో అత్తిలి మండల జనసైనికులు మరియు వీర మహిళల సంయుక్త ఆధ్వర్యంలో అత్తిలి గ్రామంలో బొంతు వారి వారిపాలెం మరియు పెద్ద హరిజన పేట మధ్య నిచ్చిన జగనన్న కాలనీలను ఇళ్ల స్థలాల పరిశీలించారు ఇక్కడ నిజమైన లబ్ధిదారులకు పేదవారకు ఈ స్థలాలు కేటాయించారు స్థలాలు కేటాయించారు కానీ ఇది చెరువును తలపిస్తుంది ఎక్కడ కట్టుకొని అవకాశం గాని సౌకర్యం గాని లేవు ఇక్కడ అనేక కోట్ల రూపాయలు అవకతవకులు జరిగాయని ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అన్నం విశ్వప్రభు, రాష్ట్రస్థాయి పార్టీ కార్యక్రమం నిర్వహణ ఉపాధ్యక్షులు దిరిశాల వెంకట, అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు మండలం ఉపాధ్యక్షురాలు తెలగరెడ్డి లక్ష్మి మరియు పంతం నానాజీ, కేశవ మరియు అత్తిలి మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.