ప్రమాదకరంగా ఉన్న రోడ్డు-బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి: గౌతమ్ కుమార్

ఉరవకొండ నియోజకవర్గం: ఉరవకొండ మండలంలో ఉరవకొండ నుంచి కనేకల్ వెళ్ళే ప్రధాన రహదారిని మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రోడ్డును పరిశీలించడం జరిగింది. నింబగళ్లు సమీపంలో తుంగభద్ర ఎగువ కలువ వద్ద రాగానే రహదారి ప్రమాదకరంగా ఉంది. ఈ కాలువపై మూడేళ్ల క్రితం నిర్మించిన అనుకూలంగా ఆర్&బి అధికారులు రహదారి మార్పు చేయలేదు ఇరుకైన కల్వర్టు ఉంది. ఇరుకు దారిలో రాకపోకలు కష్టంగా మారి ఏమాత్రం పొరబడిన ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని తెలియజేశారు. తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు ఆధునికరించి చర్యలు చేపట్టకపోతే జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్, దేవేంద్ర, ఉపాధ్యక్షులు గుడిసెల రాజేష్, రమేష్, మల్లేష్ గౌడ్, మనికుమర్, బోగేష్, నరేంద్ర, కుమార్, అజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.