వి.ఆర్.ఏల దీక్షకు మద్దతు తెలిపిన ఉండి జనసేన

రాష్ట్ర వ్యాప్తంగా వి.ఆర్.ఎ లుగా పని చేస్తున్న ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 10500 నుంచి 21000 వేలకు పెంచాలని.. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. గత 14 రోజులుగా తహశీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులకు, సభ్యులకు మద్దతుగా ఉండి మండల జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు సంగిభావంగా ధీక్షలో పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. వి.ఆర్.ఏ లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారి న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని వారికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియచేస్తున్నటు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉండి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు యడవల్లి వెంకటేశ్వరరావు, పడమటి త్రిమూర్తులు, కుచ్చు శివ కృష్ణ, యర్రా రవి,షేక్ సిద్ధ సాహెబ్, అడపా గణేష్, బద్ది సత్యనారయణ, అడబాల భువన్, పెద పాటి ప్రసాద్, మచెం మూర్తి, బీసీ కాలనీ శేఖర్ మరియు జన సైనికులు పాల్గొని వారి దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది.