ఉండ్రాజవరం జనసేన చేయూత

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో గంటా వెంకట్రావు గారి సందులో వేండ్ర సావిత్రి (వయసు 14 సం) పరమపదించిన కారణంగా వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆ అమ్మాయి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ.. ఉండ్రాజవరం జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి 4000 రూపాయలు అందజేయడం జరిగింది.

అదేవిధంగా.. ఉండ్రాజవరం గ్రామంలో మాదిగ పేటలో చిట్టిగుళ్ల అచ్చమ్మ పరమపదించిన కారణంగా వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..ఉండ్రాజవరం జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి 4000 రూపాయలు అందజేయడం జరిగింది.

అదేవిధంగా.. ఉండ్రాజవరం గ్రామంలో కాసాని వెంకటరమణ సందులో బూపన్న పేట ఎస్ కే బాషా ( తాపీ మేస్త్రి) గారికి గత నెల జరిగిన ప్రమాదం కారణంగా వారు కొన్ని నెలలు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నందున.. వారికి కొద్దిపాటి సహాయంతో వారి కుటుంబాన్ని పరామర్శించి. ఉండ్రాజవరం జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి 4000 రూపాయలు అందజేయడం జరిగింది.

అదేవిధంగా.. ఉండ్రాజవరం గ్రామంలో జనసేన పార్టీ ఎంపీటీసీ వీరమళ్ళ వరలక్ష్మీ మూడు నెల జీతం (నెలకి 3000) మొత్తం 9000 కి ఇంకొక 1000 కలిపి మొత్తం10,000 రూపాయలు పార్టీకి అనుభందంగా పని చేస్తున్న జనసెన చేయుతకి ఇవ్వటం జరిగింది.