ఉంగుటూరు జనసేన ఐటీ వింగ్ సమావేశం
- వైసీపీ, తెలుగుదేశం నుంచి జనసేనలోకి భారీగా చేరికలు
ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, రాచురు గ్రామం నుండి సుమారు 54 మంది తెలుగుదేశం మరియు వైఎస్సార్ సీపీ పార్టీల నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఉంగుటూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం ఉంగుటూరు నియోజవర్గం ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన ఐటీ వింగ్ సభ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాచూరు గ్రామ నాయకులు కొమ్ము వీర్రాజు, అడవికొలను గ్రామం ఎంపీటీసీ నిమ్మల దొరబాబు, ఉంగుటూరు నియోజవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ అయితం దుర్గాప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకులు మైలవరపు సురేందర్, తానేటి జోగేశ్వరరావు, తోట పవన్ నియోజకవర్గ ఐటీ వింగ్ సభ్యులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-05-at-9.01.16-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-05-at-9.01.17-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-05-at-9.01.18-PM-1-1024x576.jpeg)