దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఉంగుటూరు జనసేన
పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండలం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జనసైనికుల ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో దివ్యాంగులకు ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నౌడు బాజి, నియోజకవర్గ జనసేన నాయకులు కట్రేడ్డి చంద్రశేఖర్, భీమడోలు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-03-at-3.40.34-PM.jpeg)