గ్రేటర్ ప్రచారంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కమలం నేతలు దూకుడు పెంచారు. గ్రేటర్‌లో ప్రచారానికి కమలం అగ్రనేతలు వస్తున్నారు. హైదరాబాద్‌లో నేడు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:45కు వారాసిగూడ చౌరస్తా చేరుకుంటారు. ఒంటి గంట వరకు సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండిలోని హనుమాన్‌ టెంపుల్‌వరకు నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాంపల్లిలోని రాష్ట్రపార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం, తిరిగి ఢిల్లీ వెళతారు.