కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన జెండా ఆవిష్కరణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడే పురస్కరించుకుని జనసేన జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జనసేన పార్టీ కార్మిక నాయకులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నందగిరి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో శ్రమని చెమటగా మార్చి దేశం కోసం సమాజం కోసం వారి కష్టాన్ని బహుమతిగా ఇచ్చే కార్మికులు సైతం రాజ్యాధికారం చేపట్టే రోజులు రావాలని, అందుకు అనుగుణంగా అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో-ఆర్డినేటర్ నందగిరి సతీష్, మహిళా నాయకురాలు కావ్య, రమ్య, ముంతాజ్, లక్ష్మీ, రమ, జీవన్, దుర్గ, రమేష్, ప్రకాష్, శివ, కృష్ణతేజ, ప్రవీణ్, గోపాల్, వెంకటేష్, అనిల్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.