అలమండలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీ నాయకులు ఆధ్వర్యంలో రామభద్రపురం, చినతోలు ముండ గూడ, అప్పన్నదొర వలసలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ భాగంగా వచ్చిన రాష్ట్ర మరియు జిల్లా & నియోజకవర్గ నాయకులకి ఘన స్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, సాలూరు సమన్వయకర్త గేదెల రిషివర్ధన్, కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కట్రక మల్లేష్, పాలకొండ నియోజకవర్గం సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ కార్యదర్శిలు నేరేడుపల్లి వంశీ, గార గౌరీ, పెంట శంకర్రావు(సంజు), నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్, లీగల్ సెల్ కేతిరెడ్డి అశోక్, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు జనసేన జానీ, టిడిపి వైస్ ఎంపిపి నరేష్, టిడిపి మండల నాయకులు దాస రామారావు నాయుడు, పిటిమండ ఎక్స్ ఎంపిటిసి లచ్చిరెడ్డి సుదర్శన్ రావు, రాంబద్రపురం వార్డు మెంబరు రమేష్, జనసేన మండల నాయకులు భార్గవ్, రాజేష్, అశోక్, శరత్, రాజశేఖర్ ,ధనుంజయ్, శ్రీను, పోలి నాయుడు, రమేష్, నవీన్, ధర్మ, ఎ.శంకర్రావు, నరేష్, శంకర్, శివ, తిరుపతి, ప్రేమ్ మరియు వివిధ నియోజకవర్గాల మండల జనసేన & తెలుగుదేశం నాయకులు, జనసైనికులు & కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిబ్రమ్ మాట్లాడుతూ మన్యం జిల్లాలో జనసేన పార్టీ తరుపున జెండా ఆవిష్కరణ ఇంత చక్కగా కార్యక్రమం చేసారు అంటే జగన్ పరిపాలన ఎంతటి దారుణంగా ఉన్నదో అర్ధం అవుతుంది పవన్ కళ్యాణ్ పైన మీరు చూపించే అభిమానం మీ జీవితాలలో వెలుగులు నింపుతారు అని చెప్పడం జరిగింది.