రామాపురంలో జనసేన జెండా ఆవిష్కరణ
- పవన్ రావాలి… పాలన మారాలి అంటూ జనసైనికుల నినాదాలు
- జనసేన పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేస్తాం
- జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి
మదనపల్లి మండలం, అంకి శెట్టిపల్లి పంచాయతీ, రామాపురం గ్రామంలో బుధవారం జనసేన పార్టీ జెండాను అపార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆవిష్కరించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణి చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రామాపురం గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో జనసేన పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేసేందుకు కసరతులు చేస్తున్నామన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో విముక్త వైసిపి పాలన కోసం అతి కార్యాచరణ చేపట్టారని అన్నారు. రాబోయే కాలంలో నాయకులు, కార్యకర్తలు అందరిని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రజలు కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ, నాయకులు అడపా సురేంద్ర, జగదీష్, లక్ష్మి నారాయణ, జంగాల గౌతమ్, రాధికా తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-19.21.16-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-19.21.17-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-05-at-19.21.17-1-1024x576.jpeg)