జనసేన వారాహి పోస్టర్ల ఆవిష్కరణ

  • వారాహి పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: పేద ప్రజల సమస్యలకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో జనసేన వారాహి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. జూన్ 14వ తేదీన జనసేన పార్టీ అధినేతపవన్ కళ్యాణ్ అన్నవరం నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ పోస్టర్లను విడుదల చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.