తానం చింతలలో అంగరంగ వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ

దర్శి నియోజకవర్గం, దర్శి మండలం, తానం చింతల గ్రామంలో అంగరంగ వైభవంగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షద్, పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, తానం చింతల గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.