భైంసా జనసేన ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

భైంసా పట్టణంలోని ఎపి నగర్ కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి రూపకర్త ‘భారతరత్న’ డాక్టర్ భి.ఆర్ అంబేద్కర్. ఎంతోమంది మేధావుల అభిప్రాయాలను తీసుకొని, ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారతదేశాన్ని ఒక గొప్ప, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దేందుకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలాన్ని వెచ్చించి రాజ్యాంగాన్ని లిఖించారు అంబేద్కర్. ఇది ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. ఇలా లిఖించబడిన రాజ్యాంగం 1950, జనవరి 26న తేదీన అమలులోకి వచ్చింది, కాబట్టి ఆ తేదీని పురస్కరించుకొని స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ, మన దేశభక్తిని చాటుతూ, సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.