సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన యు.పి.రాజు

రాజాం: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త పోగిరి సురేష్ బాబును తమ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు. ఈ సందర్బంగా పోగిరి సురేష్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలనీ కోరారు. యు.పి.రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గెలుపే దిశగా టీడీపీ క్యాడర్ తో కలిసి పని చేస్తామని అన్నారు.యు.పి.రాజు తో పాటు నాలుగు మండలాల నాయకులు గోవిందరావు, బాలకృష్ణ, శ్రీధర్, రాంబాబు, అప్పలనాయుడు, రాజారావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.