ఊరు వాడా జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం

  • రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన” ఊరు వాడా జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం” కార్యక్రమం
  • హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ చేసిన బత్తుల
  • ఉత్సాహంగా, భారీగా పాల్గొన్న జనసేన- టిడిపి శ్రేణులు
  • జననీరాజనాలతో ఉదృతంగా కొనసాగుతున్న పాదయాత్ర
  • స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తూ జనసేన టిడిపి కూటమికి సంపూర్ణ మద్దతు
  • జనసంద్రంలా బలరాముడి వెంట కధం తొక్కిన హౌసింగ్ బోర్డ్ ప్రజలు
  • టీడీపీ జనసేన కూటమిలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల భారీ విజయం తద్యంలా అనుకూల పవనాలుమహాపాదయాత్రలో భారీగా పాల్గొన్న జనసేన టీడీపీ కార్యకర్తలు
  • హరతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

రాజానగరం నియోజకవర్గం: (లాలాచెరువు) హౌసింగ్ బోర్డు కాలనీలో జనం కోసం జనసేన- మహాపాదయాత్రలో భాగంగా.. రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, వారి కుమార్తె శ్రీమతి తోట ప్రత్యూష దేవి పాల్గొన్నారు.. పాదయాత్రలో మొదటగా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అక్కడి నుండి పాదయాత్రగా టీడీపీ మరియు జనసేన శ్రేణులతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్తూ జనసేన పార్టీ సిద్ధంతాలు, ఆశయాలు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. దారి పొడవున ఏర్పాటు చేసిన అనేకచోట్ల జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.